Weather Update | తెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని, పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని వివరించింది. గడిచిన 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, హన్మకొండ, సూర్యాపేట, ఖమ్మంతో పాటు పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.