Asifabad | ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలోని చిర్రకుంట సెక్షన్లో శుక్రవారం ఉదయం అటవీ అధికారులు అక్రమ కలప పట్టుకున్నారు. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని భవానినగర్ నుండి వస్తున్న టాటా ఇండికా విస్టా కారు నెంబర్ (టీఎస్08 యుబి3974) వాహనంలో అక్రమంగా కలప తరలిస్తుండగా సెక్షన్ అధికారి సాయి చరణ్ తన బృందంతో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో 12 కలప దుంగలు పట్టుకున్నారని, వాటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో బీటు అధికారులు ఎం.శ్రీనివాస్, రాజేష్, డి .శ్రీనివాస్ పాల్గొన్నారు.