కరీంనగర్: జిల్లాలోని గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు. అయితే లక్ష్మి మరొకరితో అక్రమసంబంధం కొనసాగిస్తున్నది. ఈ విషయంపై భార్యభర్తలు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న వెంకట్రెడ్డిని హత్యచేయాలని నిర్ణయించుకున్నది. ఇంకేముంది రోకలిబండతో అతడిని కొట్టి చంపింది. అతని మృతదేహాన్ని ప్రియుడు వెంకటస్వామి సాయంతో హుస్నాబాద్ పొట్లపల్లి వాగులో పూడ్చిపెట్టింది.
అయితే వెంకట్రెడ్డి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు పెనుగొండ లక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటస్వామిని అరెస్టు చేశారు.