నిర్మల్ : జౌలి గ్రామస్తుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మంత్రి స్వర్ణ ప్రాజెక్ట్ వద్ద రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన లో-లెవల్ కాజ్ వేను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే ఇక్కడ లో-లెవల్ కాజ్ వే నిర్మించి ఉంండాల్సింది. కానీ వంతెన లెకపోవడంతో జౌలి గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.
ఎన్నికల హామీ మేరకు గతేడాది లో-లెవల్ కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. ఏడాదిలోనే వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. లో-లెవల్ కాజ్ వే అందుబాటులోకి రావడంతో జౌలి గ్రామస్తులకు ప్రత్యేకించి రైతులకు, విద్యార్థులకు దూర భారం తగ్గుతుందని వివరించారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యతనిస్తురన్నారని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
చెక్ డ్యామ్ల వల్ల వాగులు, వంకలు కొండల పైనుంచి వృథాగా పోతున్న నీటిని నిల్వచేసి రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కు వ చెక్డ్యామ్లు మంజూరు చేసుకున్నామన్నారు.
చెక్డ్యామ్ల వల్ల పరిసర ప్రాంతాల్లోని రైతుల కు భూగర్భ జలాలు పెరిగి వారికి సాగు నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు