హైదరాబాద్, ఫిబ్రవరి 7: రేడియేషన్ థెరపీలో కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఐఐటీ హైదరాబాద్కు ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సహకారం అందించనున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్స కోసం కణితి కదలిక, రేడియేషన్ హైపర్థెర్మియా కోసం స్వదేశీ రోబోటిక్ అల్ట్రాసౌండ్ విధానాన్ని అభివృద్ధి చేయటానికి అమృత హాస్పిటల్లోని రేడియేషన్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ విశ్వనాథన్ ఎంపికయ్యారు.
ఐఐటీ హైదరాబాద్లోని మెడికల్ అల్ట్రాసౌండ్ రీసెర్చ్ లాబోరేటరీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అవినాశ్ ఈరంకి, ఈరంకి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమృత సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రోబోటిక్స్తో కలిసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. ఐసీఎంఆర్ మం జూరు చేసిన ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నట్టు డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు.