హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ఆధునిక సాంకేతికను అవలంబిస్తూ.. ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 2021-22 సంవత్సరానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఐఐఐఈ) సంస్థ సింగరేణికి పర్ఫామెన్స్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానం చేసింది.
ఈ నెల 6 నుంచి 8 వరకు గోవాలో జరిగిన 22వ సీఈవోల సదస్సులో గోవా ఎమ్మె ల్యే అలెక్స్ రెజినాల్డో లారెంకో చేతుల మీదుగా సింగరేణి డీజీఎం(ఐఈ) ఎన్ భాస్కర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సింగరేణికి అవార్డు దక్కడం పట్ల సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు.