హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని మంజూ రు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాష్ర్టానికి లేఖ పంపిందని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఐఐహెచ్టీ ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఐఐహెచ్టీ ద్వారా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.