హైదరాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణలోని కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్ను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆ శాఖ ఐజీ వై రాజేశ్ ప్రారంభించారు. దీనికి ‘మై నేషన్ జైల్మేడ్ ఆర్టికల్స్ స్టాల్’ అని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలు కొని, వారికి పరోక్షంగా ఉపాధి కల్పించడంతో పాటు వృత్తినైపుణ్యాన్ని ప్రోత్సహించాలని కోరారు.