హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎంపీ, ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘానీ బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ మార్క్ఫెడ్ను సందర్శించారు. మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎండీ సత్యనారాయణరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
రాష్ట్రంలో రైతుల కోసం మార్క్ఫెడ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఇఫ్కో చైర్మన్కు వారు వివరించారు. మద్దతు ధరకు పంట ఉత్పత్తుల కొనుగోలు, ఎరువుల సరఫరా వంటి అంశాలను ఆయనకు సవి వరంగా తెలిపారు. రైతులకు మార్క్ఫెడ్ అందిస్తున్న సేవలను ఇఫ్కో చైర్మన్ ప్రశంసించారు.