కొల్లాపూర్, అక్టోబర్ 1 : ‘సర్వేలన్నీ నా వైపే ఉన్నాయి.. నాపట్ల జనం సానుభూతితో ఉన్నారు. నాయకులు మాత్రం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట ఉన్నారు. నాకు కాం గ్రెస్ అధిష్ఠానం టికెట్ కేటాయించకపోతే కాంగ్రెస్ జెండా పట్టుకునే రెబల్గా పోటీ చేస్తా’నని టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు స్పష్టం చేశారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో తాను ఏర్పా టు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మీడియాతో మాట్లాడారు. జూపల్లి నెలరోజుల కిందట వచ్చి తనకే టికెట్ కావాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం సర్వే ప్రకారం టికెట్ తనకే కేటాయించాలని కోరారు. ఎంత మంది పోటీలో ఉన్నా.. జనం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. తాను చాలా ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టప డ్డా.. పడుతున్నా.. ఎన్నో మీటింగ్లు నిర్వహించానని తెలిపారు.