రవీంద్రభారతి, జనవరి 28: సర్పంచులకు పెండింగ్ బిల్లులను ఫిబ్రవరి 2లోగా విడుదల చేయాలని, లేనిపక్షంలో స్పెషల్ ఆఫీసర్లను అడ్డుకుని, గ్రామపంచాయతీలకు తాళాలు వేసి ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతామని తెలంగాణ సర్పంచుల సంఘం హెచ్చరించింది. వడ్డీల మీద వడ్డీలు పెరిగి సర్పంచులు ఆత్మైస్థెర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆదివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి కొలను శ్రీనివాస్రెడ్డి, సహా య కార్యదర్శి బిట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్రీడాప్రాంగణం, రైతువేదిక, శ్మశానవాటిక, పంచాయతీ భవన నిర్మాణాల పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. జనవరి 31న సర్పంచుల కాల పరిమితి ముగిసిపోనున్నందున ఎన్నికలు జరిగే వరకు గౌరవంగా సర్పంచులు కొనసాగేలా చూడాలని కోరారు.