నల్లగొండ : మోటర్లకు మీటర్లు పెడుతామని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చెబుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి తప్పుడు మాటల్తో మీ దగ్గరకు వస్తారు. మునుగోడులో కనుక బీజేపీ గెలిస్తే.. మోటర్లకు మీటర్స్ రావడం ఖాయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పోమవారం నాంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
2014లో కేసీఆర్ను గెలిపించి ప్రజలు అధికారం అప్పగించారు. దీంతో వృద్ధులకు పెన్షన్ పెంచారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్ ఇలా అనేక పథకాలు తీసుకొచ్చారు. ప్రజలకు ఎది కావాలో అది అడగక ముందే ఇస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే అన్నారు.
ఏమీ ఇవ్వకుండా ఉన్న పథకాలను రద్దుచేస్తూ ఎగిరెగిరి పడుతున్న బీజేపీని చూస్తున్నాం. బీజేపీతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం లేదన్నారు. నాడు నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ గుప్పెట్లో కునారిల్లింది.
సీఎం కేసీఆర్ గెలిలిచాక మిషన్ భగీరథ ను ఇక్కడి నుంచి ప్రారంభించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారన్నారు. మునుగోడులో అభివృద్ధి జరిగింది అంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హయాంలోనే. ప్రస్తుతం మళ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.