హైదరాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక అవసరాల నిమిత్తం ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) సంస్థకు ఇచ్చిన భూములను ఇతరులకు లీజుకు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఔషధ పరిశ్రమ కోసం మంజూరు చేసిన భూమిని లీజుకు ఇచ్చే హకు లేదని ఆ భూమి కేటాయింపు సమయంలో జరిగిన అగ్రిమెంట్లు స్పష్టం చేస్తున్నాయంటూ..
నిర్దిష్ట ప్రయోజనం కోసమే ఆ భూమిని వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ఐడీపీఎల్కు కేటాయించిన భూములపై జోక్యం చేసుకునే హకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న వాదనను తిరసరించింది.