కోటపల్లి, ఫిబ్రవరి 22 : మంచిర్యాల(Manchiryala) జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి(Borampally) గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతీబా పూలే, సావిత్రీబాయి ఫూలే ( Phule couple)విగ్రహాలను(Idols) బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి, గ్రామానికి చెందిన ఉడుత బాపును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా, పోలీసులు పర్యవేక్షించారు. పంచాయతీ కార్యదర్శి మఠధుకర్ ఫిర్యాదు మేరకు ఉడత బాపును అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.