సైదాబాద్, మార్చి 3: రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. సంగారెడ్డికి దివ్యాంగురాలు ప్రవళిక, మేడ్చల్కు చెందిన మట్టా రమేశ్గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారం సైదాబాద్ మొయిన్ రోడ్డుపై ఉన్న ఎస్బీఐ బిల్డిం గ్ ఆర్యా ఈవెంట్స్ ఈ వేడుకకు వేదికైంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్కుమార్, అరుణ ఈ వివాహాన్ని జరిపించారు.
ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘రూపాయికే పెండ్లి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన వందలాది మంది గూగుల్ పే ద్వారా రూపాయి చెల్లించారని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ కమ్యూనిటీ రెస్పాన్స్బులిటీ సర్వీస్ (సీఎస్ఆర్) ఫండ్ ఇన్చార్జి లక్ష్మీనారాయణ పెండ్లి కూతురు తల్లికి రూ.25 వేలు చెక్కు అందజేశారు. వివాహానికి హాజరైన వారంతా కట్నకానుకలు చదివించారు. నిలోఫర్ కేఫ్ అధినేత ఏ బాబురావు అతిథులు, ఆహూతులకు స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్రెడ్డి, తదితరులు హాజరయ్యారు.