నిజామాబాద్, జూన్ 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో మంగళవారం ఆమె పర్యటించారు. సీహెచ్కొండూర్ గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలవేల్పు లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని తమ కుటుంబం ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తామని ప్రకటించిన కవిత.. అందుకోసం గ్రామస్థులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఇంటింటి జ్వరసర్వేతో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపారు. ఆలయ దర్శనం అనంతరం రూ.110 కోట్లతో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలను కలిపేలా గోదావరి నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించారు. నందిపేట్ మండలానికి మహారాష్ట్ర నుంచి రాకపోకలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా గ్రామస్థాయిలోనే కరోనా కట్టడి చేసేలా చర్యలు చేపట్టామని చెప్పారు. కరోనా థర్డ్వేవ్ ముప్పు రానుందన్న ప్రచారం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్, అచ్చంపేట ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, గువ్వల బాలరాజ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నాయకులు పాల్గొన్నారు.