హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో అసమాన సేవలు అందించిన 14 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్(ఐడీసీ)- 2023’ అవార్డులను ప్రదానం చేసింది. మంగళవారం గోల్కొండకోటలోని రాణిమహాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 14 మందికి అవార్డులు అందజేశారు. ప్రాణాలకు తెగించి వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించారని, ఎంతోమంది ప్రాణాలను రక్షించారని సీఎం కేసీఆర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. 14 మందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఉత్తమ సేవలకు అవార్డులు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు వీరే:
పాయం మీనయ్య (ఎస్జీటీ, గిరిజన ఆశ్రమ పాఠశాల): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో వరదల్లో చికుకున్న పాఠశాల విద్యార్థులను రక్షించారు.
ఎండీ రహమాన్ (లైన్మెన్, విద్యుత్తు శాఖ): జనగామ జిల్లాకు చెందిన రహమాన్ ఇటీవల అతిభారీ వర్షాల్లోనూ విద్యుత్తు పునరుద్ధరణలో విశేష సేవలు అందించారు.
సంజీవ్రావు (పంచాయతీ సెక్రటరీ): ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతంలో చికుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
ప్రసన్నరాణి (ములుగు జడ్పీ సీఈవో): ములుగు జిల్లా కొండాయి గ్రామంలో వరదల్లో చికుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతోపాటు వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని సమర్థంగా పర్యవేక్షించారు.
ఆర్ఏఎస్పీ లత (జిల్లా పంచాయతీ అధికారి): భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాలు వరదల్లో చికుకున్నప్పటికీ, ప్రాణనష్టం జరగకుండా రెస్యూ ఆపరేషన్ చేపట్టారు.
బీ ప్రదీప్కుమార్ (రెవెన్యూ ఇన్స్పెక్టర్): భూపాలపల్లి జిల్లాలో వరదల్లో చికుకున్న ప్రజలను రక్షిచేందుకు బోట్లు, హెలికాప్టర్ సేవలను వినియోగించి 100 మందికి పైగా ప్రజలను రక్షించి, పునరావాస కేంద్రాలకు తరలించారు.
వీ వెంకటేశ్వర్లు (అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ శాఖ, భద్రాద్రి): భద్రాద్రి జిల్లాలో వరదల్లో చికుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
ముత్యాలరావు (మండల పంచాయతీ అధికారి): భద్రాద్రి జిల్లాలో వరదల్లో చికుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించారు. వారికి రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
రామనరసింహారెడ్డి (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భూపాలపల్లి జిల్లా (వరంగల్ కమిషనరేట్): వరదల్లో చికుకున్న ప్రజలను సురక్షితంగా తరలించారు. తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు.
వీ నరేశ్ (సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భూపాలపల్లి జిల్లా (వరంగల్ కమిషనరేట్): ఇటీవల మానేరు నది వరదల్లో చికుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా కాపాడారు.
కే సంపత్ (అసిస్టెంట్ సబ్ సబ్ఇన్స్పెక్టర్, వరంగల్ జిల్లా, మట్వాడ పీఎస్): తన టీమ్తో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చికుకున్న 880 మంది ప్రజలను రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జీ రాంబాబు (అసిస్టెంట్ సబ్ సబ్ఇన్స్పెక్టర్): ములుగు జిల్లా మేడారంలో వరదల్లో చికుకున్న 19 మందిని తన బృందం సభ్యులతో కలిసి రక్షించారు.
కే శ్రీకాంత్ (పోలీస్ కానిస్టేబుల్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్పెషల్ పార్టీ): తన బృందంతో కలిసి ములుగు జిల్లా మేడారం జంపన్న వాగు వరదల్లో చికుకున్న 19 మందిని రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఏడిగ చిట్టిబాబు (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎన్ఆర్ఐ సెక్షన్, జీఏడీ, హైదరాబాద్): ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చికుకున్న తెలంగాణ విద్యార్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్ర పోషించారు. 2014 నుంచి నేటివరకు వేర్వేరు దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన 1,200 మంది మృతదేహాలను తెలంగాణకు తరలించడంలో ఆయా దేశాల ఎంబసీలు, కాన్సులేట్ అధికారులు, హైకమిషనర్లతో సమన్వయం, సంప్రదింపులు జరిపి, వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగించడంలో ఏడిగ చిట్టిబాబు గొప్ప పాత్రను పోషించారు.