IAS Officers Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్గా బీ గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్గా ప్రఫుల్ దేశాయ్ నియామకమయ్యారు. నల్గొండ కలెక్టర్గా ఆర్వీ కర్ణణ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా వెంకటేశ్ దోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్గా చెక్కా ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ్ పాటిల్ను బదిలీ చేసింది. పెద్దపల్లి అదనపు కలెక్టర్గా జే అరుణ శ్రీ, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్గా జీ రమేశ్గా నియామకమయ్యారు. ప్రస్తుతం నల్గొండ కలెక్టర్గా పని చేస్తున్న టీ వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.