నిజామాబాద్: జిల్లా నూతన కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ హనుమంతు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి. నారాయణరెడ్డి వికారాబాద్ జిల్లాకు బదిలి కాగ.. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా రాజీవ్ గాంధీ హనుమంతు నేడు బాధ్యతలు చేపట్టారు. 2012 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రాజీవ్ గాంధీ హనుమంతు అంతకుముందు హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.
రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా 2020 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించగా. ఆయన హయాంలోనే వరంగల్, హనుమకొండ జిల్లాల పునర్విభజన జరిగి.. కొత్త కలెక్టరేట్ భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది.