Tellam Venkat Rao | తాను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. కడవరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తెలిపారు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేసే వ్యక్తిత్వం తనది కాదని తెల్లం వెంకట్రావు అన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మున్ముందు మంత్రులనూ కలుస్తానని, ఆ విషయంలో వెనుకంజ వేయనన్నారు. ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి భద్రాచలంలో పర్యటింనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలను గుర్తించి, ముఖ్యమంత్రికి నివేదించాలని సూచించారు.