రాజన్న సిరిసిల్ల : నాకు రాజకీయ భిక్షని ప్రసాదించిన నియోజకవర్గం సిరిసిల్ల(Siricilla district). సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి సిరిసిల్ల అభివృద్ధి చేసాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR )అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం ఆయన మాట్లాడుతూ..సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా పనిచేసాను. ఎట్లుండే సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయిందనేది ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో సిరిసిల్ల అభివృద్ధిలోనే ముందున్నది. కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిది ఏండ్లు మంత్రిగా పనిచేసాను. గౌరవ మెజారిటితో తిరిగి గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు. తానే క్యాండెట్ అనే విధంగా ప్రజలు నాలుగుసార్లు గెలిపించారు. ఇంటింటికి ప్రగతి నివేదికలు పంపుతామన్నారు. నేను సిరిసిల్లకి ఏం చేసాను, కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయో చూడాలన్నారు.
రాజీలేని పొరాటం చేస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ దండయాత్ర కు వస్తున్నాయని మండిపడ్డారు. గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి వస్తే ఊరుకుందమా ? చేవలెని, సాతగాని వాళ్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా..కన్నీళ్ళు కావాలా..నీళ్లు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నడూ కులం, మతం పేరుతో కుంపట్లు పెట్టలేదని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే కులం, మతం అంటున్నారు. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నాయకులు మనకు అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వాడు వచ్చి దండయాత్ర చేస్తుంటే ఊరుకుందమా? తాత్కలిక పైసలు, మందుకు లొంగిపోతే దీర్ఘకాలం బాధపడుతామన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్లీ బాధపడాల్సి వస్తదని ఇంటి పార్టీ బీఆర్ఎస్ను గెలిపించుకుంటే కష్టాలు తీరుతాయన్నారు.