Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో హైడ్రామా కొనసాగుతున్నది. టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులొచ్చాయి. కేవలం దరఖాస్తు చేసుకున్నవారికే టికెట్ ఇస్తారా? అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతల వద్ద సమాధానం లేదు. ఎన్నికల కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయినా తేల్చిందేమీ లేదు. దరఖాస్తుల స్వీకరణ, కమిటీ భేటీలపై ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కీలక భేటీకి కోమటిరెడ్డి డుమ్మా అభ్యర్థుల ఎంపికలో కీలకమైనదిగా కాంగ్రె స్ చెప్పుకొంటున్న ఎన్నికల కమిటీ రెండో భేటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ కమిటీతో అయ్యేదేమీ లేదని, అభ్యర్థుల ఎంపికపై తన అభిప్రాయాన్ని స్క్రీనింగ్ కమిటీకి, అధిష్ఠానానికి చెప్తానని అనుచరుల వద్ద అన్నట్టు సమాచారం. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారనే వార్తలపై సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి స్పందించారు. ‘టికెట్ ఎవరైనా అడగొచ్చు. టికెట్ అడిగేందుకు ఎలాంటి జీఎస్టీ అవసరం లేదు. పాలేరు టికెట్కు ఇంకా ఎవరైనా మిగిలారా?’ అంటూ సెటైర్లు వేశారు.