హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్, హెచ్ఎఫ్ఎల్.. పేదలు, మధ్యతరగతి వర్గాలకే పరిమితామా అని నిలదిశారు. ధనవంతులు, బడాబాబులకు మినహాయింపు ఉంటుందేమోనని ఎక్స్వేదికగా విమర్శించారు.
మూసీ సుందరీకరణ పేరుతో రివర్బెడ్లో ఉన్న ఇండ్లను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసి నదిలో నిర్మాణాలను చేపడుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడా నంస్థల నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. దానిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమోనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
I guess FTL/HFL, Buffer zone, HYDRA scare tactics & rules strictly apply only to the poor & middle class people
Rich & mighty can get away with anything 👏
Selective justice & enforcement https://t.co/IpRfRPV11p
— KTR (@KTRBRS) October 23, 2024