హైదరాబాద్ : తక్షణమే కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) విద్యార్థులు డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపాలని విద్యార్థులు నిర్ణయించారు. అంతేకాకుండా #ConductCasteCensus అనే హ్యాష్ట్యాగ్తో ఆన్లైన్లో ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
కుల గణనను నిర్వహించడం ద్వారా సమ్మిళిత విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, సమర్థవంతమైన సామాజిక సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీని తాము అభ్యర్థిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. ఓబీసీల అభివృద్ధికి కుల గణన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కుల గణనను నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.