హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి నగర యువత ‘ప్రశ్న’లతో స్వాగతం పలికారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షను కండ్లకు కట్టినట్టు చూపుతూ.. ప్రశ్నలు విసిరారు. వీటికి సమాధానాలు చెప్పగలరా? అంటూ నిలదీశారు. మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టారు.
మోదీకి సంధించిన 17 ప్రశ్నలు..
1. కేంద్రం తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
2. తెలంగాణలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎకడ ఉంది?
3. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది?
4. తెలంగాణకు ఐఐఎం ఎకడ?
5. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడం లేదు?
6. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ను గుజరాత్కు ఎందుకు తరలించారు?
7. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది?
8. నిజామాబాద్లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
9. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎకడ?
10. రాష్ర్టానికి డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?
11. తెలంగాణకు మెగా పవర్ లూమ్ టెక్స్ టైల్ క్లస్టర్ ఒకటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
12. ఐటీఐఆర్ ఎకడ?
13. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
14. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
15. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎకడ?
16. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
17. హైదరాబాద్ కు వరద సాయం ఎందుకు చేయలేదు?