హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా గడిచిన 24 గంటల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాలో 10.5 డిగ్రీలు, భద్రాచలం 17, దుండిగల్ 16.1, హకీంపేట 15.3, హనుమకొండ 14, ఖమ్మం 15, మెదక్ 11.4, రామగుండంలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నది.