హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జలమండలికి ఈ ఏడాది మరో పురస్కారం లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొ సైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ అవార్డు-2023ను జలమండలి కై వసం చేసుకున్నది. ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్-2023లో ‘కాఫీ టేబు ల్ బుక్’ క్యాటగిరీలో జలమండలికి ద్వి తీయ బహుమతి లభించింది. ఇండియ న్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇతర మల్టినేషనల్ కంపెనీలతో పోటీపడి ఈ అవార్డును దకించుకున్నది. గత నెల 27న ఢిల్లీలో ఈ అవార్డు ప్రదానం చేసింది. ఈ పురసా రం దక్కడంపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ ఒక ప్రకటనలో హ ర్షం వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి పీఆర్వో సుభాష్, ఓఎస్టీ పీఆర్వో మనోహరాచారి శనివారం పురసారాన్ని ఎండీకి అందించారు. ఈ సందర్భంగా ఎండీ అభినందించారు. నిరుడు పీఆర్ఎస్ఐ నిర్వహించిన వివిధ పోటీల్లో జలమండలికి రెండు అవార్డులు దక్కాయి. జలమండలి పీఆర్ఎస్ఐ నేషనల్ అవార్డు గెలుచుకోవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. జలమండలి ఈ ఏడాది ఇప్పటికే 4 అవార్డులు దక్కాయి. మార్చి 18న వరల్డ్ వాటర్, మే 1న ఉత్తమ యాజమాన్య, జులై 5న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), ఆగస్టు 1న గ్లోబల్ ఇన్నోవేషన్ ఇన్ వాటర్ టెక్నాలజీ- 2023 అవార్డులు వచ్చాయి. తాజా అవార్డుతో మొత్తం జలమండలి ఈ ఏడాది 5 పురసారాలను తన ఖాతాలో వేసుకున్నది.