హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ తీరు పలువురికి ఆగ్రహం తెప్పించింది. నా రాయణగూడలో అంబులెన్స్ డ్రైవర్ అత్యవస ర సైరన్ మోగించడంతో పోలీసులు సిగ్నల్ క్లియర్ చేసి, దారి ఇచ్చారు. సిగ్నల్ దాటిన తర్వాత అతడు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి బజ్జీలు తింటూ కనిపించాడు. గమనించిన కానిస్టేబుల్ వాహనం దగ్గరికి వెళ్లి పరిశీలించ గా, అందులో రోగి కనిపించలేదు.
ఎందుకు సైరన్ మోగించావని ప్రశ్నించగా, అతడు రోగి ఉన్నట్టుగా ముందు కట్టు కథ చెప్పాడు. కానిస్టేబుల్ ఆ వీడియోను తీసి, డీజీపీకి పంపడంతో ఆయన తక్షణమే స్పందించారు. అంబులెన్స్ల సైరన్స్కు ఓ అర్హత, విలువ ఉన్నదని.. వాటిని దుర్వినియోగం చేయొద్దని హితవు చెప్పారు. అత్యవసర సమయాల్లో మాత్రమే సైరన్ ఉపయోగించాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంబులెన్స్ సేవలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ట్వీట్ చేశారు.