హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నీటి నిల్వల కేంద్రంగా హైదరాబాద్ రాతికొండలు నిలిచాయని, ఆకట్టుకొనే నిర్మాణ శైలితోపాటు తెలంగాణవ్యాప్తంగా రాతి శిలలపై చిత్రాలు కలిగి ఉన్న నగరం హైదరాబాద్ అని చరిత్రకారులు పేర్కొన్నారు.
యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవాల సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు ఎంఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ హైదరాబాద్ను సందర్శించే పర్యాటకులకు అద్భుత ప్రాంతాలు, కట్టడాలు దర్శనమిస్తాయని అన్నారు.