హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు కూరగాయల మాటున భారీగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. రూ.30 లక్షల విలువైన 300 కిలోల గంజాయిని, డీసీఎంను స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. శనివారం బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్కు చెందిన విలాస్ బహు షాహెబ్దోకనే, అహ్మద్నగర్కు చెంది న డ్రైవర్ ద్యానేశ్వర్ మెహితి.. ఏపీలోని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన గంజాయి సరఫరాదారు వనపల్లి నాగసాయి వద్ద కిలో గం జాయి రూ.1500కు కొంటున్నారు. దానిని కిలో మహారాష్ట్రలో రూ.10 వేల చొప్పున విక్రయిస్తున్నారు. వైజాగ్నుంచి రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, మీ దుగా మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు గంజా యి తరలిస్తున్నారు. అక్కడినుంచి పుణె, ముంబయికి సరఫరా చేస్తున్నారు. డీసీఎం లో కూరగాయల మధ్యలో లోడ్చేసి తరలిస్తు న్న 300 కిలోల గంజాయిని నార్త్జోన్ టా స్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం, మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందం మూసారంబాగ్లో కాపుకాసి పట్టుకున్నది.