హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాకు గురైన, తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికుల జీవితాల్లో తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్’తో చిరునవ్వులు పూయిస్తున్నారు. అలాంటి చిన్నారుల జాడ కనిపెట్టేందుకు గత నెల 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదో విడత తనిఖీలు నిర్వహించి 3,406 మందిని రెస్క్యూ చేశారు. వారిలో 2,965 మంది బాలురు, 441 మంది బాలికలు ఉన్నట్టు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతిలక్రా మంగళవారం ప్రకటించారు. ఈ తనిఖీల్లో పోలీస్శాఖతోపాటు మహిళా, శిశు సంక్షేమశాఖ , కార్మికశాఖ, లీగల్ సర్వీస్ అథారిటీ, ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నట్టు తెలిపారు.
ఆపరేషన ముస్కాన్-8 ముఖ్యాంశాలు