హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా టోనీకి, వ్యాపారులకు మధ్య ఏజెంట్లుగా పనిచేసినట్లు తెలుస్తున్నది. ఓయో రూములను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.
మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడైన టోనీ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. నేటితో అతని కస్టడీ గడువు ముగియనున్నది. కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించడంతో పంజాగుట్ట పోలీసులు టోనీని తమ అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా డ్రగ్సుకు సంబంధించిన వివరాలను అతని నుంచి రాబట్టారు. అతడిచ్చిన సమాచారంతోనే మరో ఏడుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.