హైరదాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రీజినల్ పాస్పోస్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
సాంకేతిక కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని, పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్లాట్ను రీ షెడ్యూల్ చేస్తామని, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం చేరవేస్తామని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్లు వచ్చిన వారంతా షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులను సమర్పించాలన్నారు.