హైదరాబాద్ : హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓ అడవి దున్న పుట్టింది. అదే రోజు ఖడ్గమృగం పిల్ల కూడా ఒకటి జన్మించింది. ఖడ్గమృగం పిల్లకు నంద అని పేరు పెట్టిన అధికారులు.. అడవి దున్న పిల్లకు కుమ్రం భీం అని పేరు పెట్టారు. దీంతో కుమ్రం భీం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, ఆదివాసీలు ఆ పేరును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అడవి దున్నకు పెట్టిన కుమ్రం భీం పేరును నెహ్రూ జూ పార్క్ అధికారులు ఉసంహరించుకున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిస్పందన, కుమ్రం భీం అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.