దుండిగల్, డిసెంబర్ 28 : తమ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల కృషితో ఈ ఏడాదిలో 104 యుటిలిటీ పేటెంట్లను ప్రచురించి, కీలక మైలురాయి సాధించామని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కాలేజీ సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం మేడ్చల్ మలాజ్కిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2020లో తమ కళాశాలలో మేధో సంపత్తి ఫెసిలిటేషన్ సెంటర్ (ఐపీఎఫ్సీ) ను స్థాపించామని తెలిపారు.
అధ్యాపకులు, విద్యార్థులతోపాటు అన్ని విద్యాసంస్థలు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్లకు ముందస్తు ఆర్టి సెర్చ్, ఐపీ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రియల్టైం సమస్యలకు పరిష్కారాలు కనుగొనటం, సాధారణ ప్రజలకు ఉపయోగపడే నినాదంతో తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. యుటిలిటీ పేటెంట్, ఇండస్ట్రీయల్ డిజైన్, కాపీరైట్, వివిధ రకాల ఐపీఆర్ల ద్వారా విద్యార్థుల ఆలోచనలను సురక్షితమైన మార్కెట్ ఉత్పత్తులుగా మార్చడానికి ఐపీఎఫ్సీ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ కే శ్రీనివాస్రావు మాట్లాడుతూ తమ సంస్థకు ఇదొక మైలురాయి అని చెప్పారు. ప్రచురితమైన యుటిలిటీ పేటెంట్లు, తమ అధ్యాపకులు, విద్యార్థుల ఆర్ అండ్ డీ ప్రయత్నాల ఫలితమని చెప్పారు. ఆవిష్క రణలకు మద్దతిచ్చే వాతావరణాన్ని పెంపొం దించేందుకు సిబ్బంది, విద్యార్థుల కోసం అనేక ఐపీఆర్ అవగాహన కార్యక్రమాలను నిర్వ హిస్తున్నాని తెలిపారు. ఈ మైలురాయిని అందుకోవడానికి కృషి చేసిన వివిధ విభాగాల అధిపతులకు ఆయన అభినందనలు తెలిపారు. ఐపీఎఫ్సీ హెడ్ డాక్టర్ వివేకానంద్, విభాగాధిపతులు పాల్గొన్నారు.