హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్లను అధికారులు రద్దు చేశారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధావిధిగా సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సర్వీసులు రద్దచేసిన నేపథ్యంలో మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు రావొద్దని ఆయన కోరారు.
కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను తగులబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.