Summer | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. ఇప్పడే సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నది. నల్లగొండ జిల్లా శివన్నగూడెంలో శనివారం అత్యధిక ంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యినట్టు టీఎస్ డీపీఎస్ తెలిపింది. తెలంగాణలో ఏప్రిల్ 3 వరకు ఉష్ణో గ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్టు హైద రాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉష్ణోగ్ర తలు పెరుగుతుండటంతో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అతుండటంతో ఏప్రిల్ 3 వరకు వడగాలులు ఉం టాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో శనివారం 40-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. 19 జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య రికార్డయినట్టు పేర్కొన్నది. నల్లగొండ జిల్లా శివన్న గూడెంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ య్యినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. లకవరం రోడ్ (సూర్యా పేట)లో 43, భద్రాచలం (కొత్తగూడెం) 43, సుజా తనగర్ (కొత్తగూడెం) 42.9 నమోదైంది.