Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ.. మరో వైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. నగరాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తోంది. అలా భాగ్యనగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఒప్పుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మోదీ.. ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నాను అని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం మోదీ ట్వీట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంగీకరించనప్పటికీ.. సాక్షత్తూ మోదీనే హైదరాబాద్ డైనమిక్ సిటీ అంటూ ఇన్డైరెక్ట్గా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మోదీ ప్రశంసలు కురిపించడం.. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి చెంపపెట్టు లాంటిందని చెప్పొచ్చు.
ఇక మోదీ ట్వీట్పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ను డైనమిక్ సిటీగా గుర్తించినందుకు మోదీకి ప్రత్యేక ధన్యావాదాలు అని తలసాని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు తలసాని.. టీ హబ్ -2, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనం, ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి ఫోటోలను జత చేశారు.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022
Thank you Hon’ble Prime Minister Sri @narendramodi Ji for recognising Hyderabad as dynamic city which is being developed under the able leadership of Hon’ble Chief Minister Sri KCR Garu. pic.twitter.com/CBNEmf8sST
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 2, 2022