హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడ్పల్లి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురితో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి సీఐ స్థాయి అధికారి చితకబాదాడు. ఈ ఘటనపై అతను గతంలో పని చేసిన ఠాణాలోనే కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం.. గతంలో చిక్కడపల్లి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా ప్రసాద్ కొన్నాండ్లు పని చేశారు. అప్పట్లో స్థానికుడు రాజుతో స్నేహం చేసి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. కొంత డబ్బును రాజుతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు.
తన మాట వినకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని హెచ్చరించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వివాదం ముదిరి.. మంగళవారం మరో ముగ్గురితో కలిసి రాజును ప్రసాద్ కిడ్నాప్ చేశాడు. ఈసీఐఎల్ వద్దకు తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించి చితకబాదాడని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయమై బుధవారం చిక్కడపల్లి పోలీసులకు రాజు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం గురువారం సీఐపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ ప్రసాద్ వీఆర్లో ఉన్నాడు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్తోపాటు ఉన్న వాళ్లు సాధారణ వ్యక్తులని వెల్లడించారు. అందులో ఒకరు ఓ హోంగార్డు.