శేరిలింగంపల్లి, జూలై 10: హైదరాబాద్ గచ్చిబౌలి మహిళా పీఎస్ ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ.. తన భర్త, అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరుపక్షాలను పిలిచి మాట్లాడారు. కేసు నుంచి తన తల్లి పేరును తొలగించాలని మహిళ భర్త పోలీసులను కోరగా ఎస్ఐ వేణుగోపాల్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్ను పట్టుకుని, రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐను రిమాండ్కు తరలించారు.