హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు భారీ స్థాయిలో నగదు, అక్రమ మద్యం స్వాధీనం చేస్తున్నారు. శనివారం ఫ్లయింగ్ స్కాడ్ రూ.1.95 లక్షల నగదును సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.3.45 కోట్లు స్వాధీనం చేసుకున్నది. పోలీస్ అథారిటీ ద్వారా రూ.46.81 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను 4550 సేకరించగా, సీఆర్పీసీ కింద 855 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 1621 నాన్ బెయిలబుల్ వారంట్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.