హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో జనప్రియ అపార్ట్మెంట్స్ నుంచి ముషీరాబాద్కు వెళ్లే దారిలో ఆక్రమణలను డిసెంబర్ 26లోగా తొలగిస్తామని హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై మంగళవారం వారిద్దరూ వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నామని, ఆక్రమణల తొలగింపుపై గతంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కొంత గడువు కావాలని జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ జే అనిల్కుమార్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో శతాబ్ది నిలయం ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టుధికార పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 26కి వాయిదా వేసిన ధర్మాసనం.. ఆ తేదీలోగా ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.