ముషీరాబాద్, సెప్టెంబర్ 16: యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించాడు హైదరాబాద్ కుర్రాడు. నగరానికి చెందిన భూక్య యశ్వంత్ నాయక్ ఆరు రోజుల సాహసయాత్ర చేసి శుక్రవారం ఉదయం మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించాడు.
మైనస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకొని 5,642 మీటర్ల అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాడు. గతంలో యశ్వంత్.. కిలిమంజారో పర్వతాన్ని కూడా అధిరోహించాడు. యశ్వంత్ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అంబరిల్లా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ సహకారం అందించారు.