హైదరాబాద్ : రూపే వాలీబాల్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త జెర్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో క్రీడలపై ఆసక్తి పెరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. జట్టు ప్రిన్సిపల్ ఓనర్ అభిషేక్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తిని కలిగించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల కార్యదర్శి జయేశ రంజన్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమానులు అభిషేక్ రెడ్డి కంకణాల శ్యామ్ గోపు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం అహ్మదాబాద్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 13-15, 15-9, 15-14, 15-11, 10-15 పాయింట్లతో విజయం సాధించింది. తర్వాత మ్యాచ్లో చైన్నై బ్లిట్జ్తో తలపడనున్నది.