హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రా జాసింగ్ను బుజ్జగించే చర్యలను రాష్ట్ర బీజేపీ మొదలుపెట్టింది. 2 నెలలకుపైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు న్న రాజాసింగ్ ఇంటికి ఆదివారం బీజేపీ లోక్సభ ఎన్నికల ఇన్చార్జి అభయ్ పాటిల్, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి వెళ్లారు.
ఆయనతో సమావేశమైన అనంతరం అభ య్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. రాజాసింగ్ ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన సేవలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు.