హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమేస్తే తెలంగాణ): విద్యార్థుల వీసాలను జారీ చేయడంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ప్రపంచ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల కంటే అధికంగా హైదరాబాద్ నుంచే విద్యార్థి వీసాల జారీ జరిగినట్టు కాన్సులేట్ అధికారులు తెలిపారు.
2023లో నిరుడు కంటే ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేసిందని, సందర్శకుల వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 75 శాతం తగ్గిందని తెలిపారు. 2023లో దేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల వీసాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు. యూఎస్లో చదువుతున్న పది లక్షల (ఒక మిలియన్) మంది విద్యార్థుల్లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉండట గమనార్హం.