సంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సైయంట్ ఫౌండేషన్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్లోని పది తరగతి గదులను పూర్తిగా డిజిటలైజేషన్చేసి హైబ్రిడ్ తరగతి గదులుగా మార్చింది. ఆ గదులను సోమవారం సైయంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐఐటీ హైదరాబాద్ బోర్డు గవర్నర్ బీవీఆర్ మోహన్రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ప్రారంభించారు. స్మార్టుబోర్డులు, ఇంటరాక్టివ్ వర్చువల్ ప్లాట్ఫారంతో కూడిన హైబ్రిడ్ తరగతి గదులను ఐఐటీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉన్నదని సైయంట్ కార్పొరేషన్ చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. సైయంట్ ఫౌండేషన్ ఐఐటీ హైదరాబాద్లో హైబ్రీడ్ తరగతిగదులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి చెప్పారు. ఇటీవలే ‘గివిట్ టు ఐఐటీ హైదరాబాద్’ పేరిట పోర్టల్ ప్రారంభించామని తెలిపారు. ఐఐటీకి మద్దతు ఇచ్చే జాబితాను అందులో పొందుపర్చామని, ఆర్థిక సహాయం అందజేసేవారు ముందుకు రావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజాబెనర్జీ, ఇతర ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.