హుజురాబాద్ : దళితుల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని ఓటమి భయంతోనే అడ్డుకోవాలని ఈటల రాజేందర్ కుట్ర చేస్తున్నారని హుజురాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. దళితుల పక్షపాతి అయిన కేసీఆర్ అద్భుతమైన పథకాన్ని అమలుచేస్తుంటే దళితుల అభివృద్ధిని అడ్డుకోవాలని ఈటల పన్నాగం పన్ని అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ కు దళితబంధు పథకాన్ని ఆపాలని ఫిర్యాదు చేశాడని మరముల్ల కిరణ్ వాపోయారు. తమ చీకటిబతుకుల్లో వెలుగులు నింపే దళితబంధు పథకాన్ని ఆపాలని చూస్తే ఈటల కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
ఎన్నికల సంఘానికి ఈటల రాసిన లేఖ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హుజురాబాద్ కు చెందిన జీడి. తిరుపతి మండిపడ్డారు. దళిత బంధు అణగారిన వర్గాలకు ఆశాదీపమని అలాంటి పథకాన్ని ఆపమని కోరడంఅనేది ఈటలకు దళితుల పట్ల ఉన్న ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది. గెలవననే భయం అతనిలో ఉన్నది కాబట్టే ఇలా చేస్తున్నాడని అన్నారు.
తమ కులం ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కేనని రాజన్నల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజా సమ్మయ్య ధర్మరాజు అన్నారు. అందరి బాగు కోరే టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన తెలిపారు.