కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే తమ నాయకుడు అని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ, పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు.
తాము టీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీలోకి వెళ్తామని వస్తున్న వార్తలు అవాస్తవమని వారు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచాం కాబట్టి.. టీఆర్ఎస్తోనే ఉంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే తాము గెలిచామన్నారు. సీఎం కేసీఆర్ పాలన అద్భుతంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని వారు తెలిపారు.