హుజూరాబాద్ | హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపుకోసం ఇంటింటి ప్రచారం జోరందుకుంది. జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రతి గడపకూ వెళ్లి.. ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా గెల్లు శ్రీనివాస్ ఎన్నో పోరాటాలు చేశారని, ఆ పోరాట పటిమతోనే హుజూరాబాద్లోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తాడని హామీ ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేయాలని కోరారు. దళితవాడల అభ్యున్నతికి తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచనపల్లి సర్పంచ్ కల్పనా తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ రాజారావు, మాజీ సర్పంచ్ పార్లపల్లి రమేష్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎర్రయ్య, వార్డు సభ్యులు, నాయకులు శ్రీనివాస్, సంపత్, శ్రీకాంత్, కుమార్, నాగేష్, ప్రశాంత్, రంజిత్, శంకర్, మహిళ నాయకులు పాల్గొన్నారు.